Thursday, April 25, 2024

Breaking : తండ్రి పై.. కొడుకు దాడి

తొర్రూరు టౌన్ (ప్రభన్యూస్ ):పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో తండ్రి పై కొడుకు కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారంవరంగల్ జిల్లా నెక్కొండ మండలం టీక్యా తండాకు చెందిన బానోతు రాములు ను ..టీక్యా తండా నుండి తొర్రూర్ కు వచ్చిన తండ్రిపై కుమారుడు స్వామి కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దాంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ లింగారెడ్డి సంఘటనలు పరిశీలించి..గాయలపాల‌యిన వృద్దున్ని 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి గల కారణం కుటుంబ కలహాలని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement