Sunday, May 5, 2024

TS | కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా..

ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం అటానమస్ హోదా కల్పించింది. కరీంనగర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్‌ హోదా కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 16న ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కేంద్రానికి లేఖ రాశారు. బండి సంజయ్ లేఖపై కేంద్రం స్పందించింది. అటానమస్ హోదా కల్పిస్తున్నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ అందించారు. అటానమస్ హోదా కల్పించినందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement