Friday, May 3, 2024

వ‌ర్షాల‌కు పంట దెబ్బ‌తిని రైతు ఆత్మహత్య..

రేగొండ : ఆర్థిక ఇబ్బందుల‌తో మ‌న‌స్థాపానికి గురై రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో చోటు చేసుకుంది. రంగయ్య పల్లి గ్రామానికి చెందిన దేశిని శ్రీనివాస్ (50) అనే రైతు తన సొంత చేనులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధిక వర్షాలతో పెట్టిన పెట్టుబడి రాక పంట నష్టం జరిగిందని అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కాక మనోవేదనకు గురై ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి రేగొండ పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement