Thursday, April 18, 2024

రాజీవ్ రహదారి పైకి వరద నీరు.. ట్రాఫిక్ కు అంత‌రాయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజీవ్ రహదారిపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. శనివారం రాత్రి నుండి పెద్దపల్లిలో భారీ వర్షం కురుస్తుండడంతో ఆదివారం ఉదయం జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారి నుండి వరద నీరు ప్రవహించడంతో పోలీసులు ట్రాఫిక్ ను వన్ వేకు కుదించారు. ఒకే వైపు నుండి ఇరువైపులకు వెళ్లే వాహనాలను తరలిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్దపల్లి పోలీసులు వాహనాలను తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement