Friday, April 19, 2024

కృష్ణంరాజు మృతి సినీ, రాజ‌కీయ‌ రంగానికి తీర‌ని లోటు : ఎంపీ టీజీ వెంక‌టేష్‌

కర్నూలు : ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. కృష్ణంరాజు మృతి సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. సినిమా రంగానికి, సమాజానికి ఎంతో విలువలతో కూడిన సేవలందించార‌న్న‌రు. సీనియర్ పార్టీ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా ఆయన భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా చురుకైన పాత్ర పోషించాని టీజీవి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement