Wednesday, May 1, 2024

WGL: కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోకండి… పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే.. అభివృద్ధి చేసి చూపుతానని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల మండలంలోని వేచేరేని తాడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనం పువ్వులు, హారతులతో నీరాజనం పలుకుతూ ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అట్టడుగు, పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించడం జరిగిందని, మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేసి చూపుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు. వీరితోపాటు జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement