Monday, April 29, 2024

యాదాద్రిలో భక్తుల రద్దీ

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి కిటకిటలాడాయి. ఉదయం నుండి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. శ్రీ లక్ష్మీనరహింహ స్వామి వారి ఉచిత దర్శనానికి రెండు గంటలు.. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement