Wednesday, March 27, 2024

నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి

నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ (మం) మహదేవ్ పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఇంటి అవసరాల కోసం నిర్మించుకున్న నీటి సంపులో పడి గ్రామానికి చెందిన గంగమణి అతడి కుమారుడు సంగమేశ్వర్ మృతి చెందారు. గంగమణి అంధురాలు కాగా.. ఆమె కొడుకు సంగమేశ్వర్‌ అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. తల్లీ కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement