Tuesday, May 14, 2024

చమరు ధరలపై కాంగ్రెస్ నిరసన

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ ధరలను తగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో ధర్నా నిర్వహించారు. ఇంధనం ధరలు పెంపు ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుందని, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత భూక్యా మురళీ నాయక్ నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనావత్ రాధ, జిన్నారెడ్డి పద్మజ, చుక్కల ఉదయ్ చందర్ తోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement