Saturday, April 27, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

హన్మకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడోయాత్ర సందర్భంగా హనుమకొండ అమృత జంక్షన్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ సమయంలోనే సమావేశం ఎదురు గల్లీలో కాంగ్రెస్ యువ నాయకుడు తోట పవన్ పై గుర్తుతెలియ‌ని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న తోట పవన్ ను హన్మకొండలోని ఏకశిలా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మంగళవారం ఉదయం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకశిలా ఆసుపత్రికి వెళ్లి తోట పవన్ ను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ ను కలిసేందుకు వెళ్లారు. తోట పవన్ పై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement