Wednesday, May 8, 2024

అమెరికాకి ప‌య‌న‌మ‌యిన రామ్ చ‌ర‌ణ్‌..

అమెరికా వెళ్ళేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. కాగా రామ్ చ‌ర‌ణ్ అయ్య‌ప్ప మాల వేసుకున్నారు. బ్లాక్ క‌ల‌ర్ కుర్తా పైజామా ధరించాడు. దీనికి తోడు బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు.
ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ‘‘గోల్డెన్ గ్లోబ్ 2023 సందర్భంగా అమెరికాలో ఉన్న భారీ అభిమానుల నుంచి ఊహించనంత ప్రేమను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. నేడు ఆస్కార్ వేడుకల కోసం వెళుతూ కనిపించాడు’’ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మార్చి 13న జరగనుంది. అవార్డుల కార్యక్రమం నేపథ్యంలోనే రామ్ చరణ్ అమెరికా వెళ్లారా..లేక ఇతరత్రా కార్యక్రమాల కోసం వెళ్లారా అన్నది తెలియదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మధ్యమాల్లోకి చేరాయి.

https://twitter.com/Vijayamrutraj/status/1627871712237993984
Advertisement

తాజా వార్తలు

Advertisement