Sunday, May 19, 2024

AP: టీడీపీ మేనిఫెస్టోను ప్ర‌జ‌లు న‌మ్మ‌రు… బుగ్గ‌న

టీడీపీ మేనిఫెస్టోను, చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని ఏపీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ లో ఆయ‌న మాట్లాడుతూ…. వైసీపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీని అధిగ‌మిస్తాన‌న్నారు.

సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇంటింటికీ అందించిన జ‌గ‌న్ ను మ‌రోసారి సీఎం చేసేందుకు జ‌నం సిద్ధంగా ఉన్నార‌న్నారు. త‌మ పార్టీ చేసిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను గెలిపిస్తార‌న్నారు. టీడీపీ అమ‌లుకు సాధ్యం కాని హామీలు ఇస్తోంద‌న్నారు. ఆ హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని బుగ్గ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement