Sunday, April 28, 2024

TS : డిపిఓ పై కలెక్టర్ ఆగ్రహం…బయటికి వెళ్లాలంటు ఆదేశం…

వాజేడు, మార్చి21 (ప్రభ న్యూస్): ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు డిపిఓ స్వరూప పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ పేరు చెప్పి పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని నీ పద్ధతి మార్చుకోకపోతే వేటు పడక తప్పదని హెచ్చరించారు.

తక్షణమే ఈ సమావేశ హాల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించడంతో డిపిఓ స్వరూప అక్కడి నుండి బయటకు వెళ్లి వెళ్లిపోయారు. పంచాయతీ కార్యదర్శులు అవినీతికి పాల్పడి అధికారులకు ముడుపులు చెల్లిస్తే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement