Monday, May 20, 2024

బీసీ బిడ్డలు ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి : మంత్రి కమలాకర్

వరంగల్ జిల్లా నర్సంపేట రూరల్ మండలం పాత మోగ్డుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బస్టాండ్ ను మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. బీసీ బిడ్డ‌లు ఎద‌గాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార‌న్నారు. ఆయన ఫౌండేషన్ చైర్మన్ వేములపల్లి రాజు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుంకరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement