Thursday, May 9, 2024

చంద్రబాబు, కరువు కవల పిల్లలు.. సీఎం జగన్

చంద్రబాబు, కరవు కవల పిల్లలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రైతు భరోసా నిధుల విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ… చంద్రబాబును సీఎంగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు, దత్త పుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి అని అన్నారు. అప్పుడు, ఇప్పుడూ ఒకే బడ్జెట్ అని, వాళ్లు చెప్పేది నమ్మొద్దన్నారు. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించాలన్నారు. అప్పుల పెరుగుదల అప్పటి కంటే ఇప్పుడు తక్కువేనన్నారు. మీకు జరుగుతున్న మంచిని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement