Monday, May 6, 2024

ప్రభుత్వ ఉద్యోగిని కళ్లల్లో కారం చల్లి మెడలో చైన్ అపహరణ…

నెల్లికుదురు- ప్రభుత్వం రైతు వేదిక భవనం సాక్షిగా మహిళా ఉద్యోగిని ఏఈఓ ప్రతిభ పై గుర్తు తెలియని కళ్లల్లో కారం చల్లి మెడలో బంగారు ఆభరణాన్ని అపహరించుకుపోయాడు.ఈ చోరి మండలంలోని ఆలేరు గ్రామం రైతు వేదిక భవనం లో చోటుచేసుకుంది. భాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా రైతు వేదిక భవనం లో కూర్చొని ఉండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి పంటలకు సంబంధించిన వివరాలు అడుగుతున్న తరుణంలో తన వెంట తెచ్చుకున్న కారం కళ్లలో చల్లి మెడలో బంగారు చైను లాక్కొని పరారై పోయినట్లు తెలిపారు . వెంటనే విషయాన్ని తన పై అధికారులకు తెలియపరిచానని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement