Thursday, May 16, 2024

శాంతి చర్చలకు సిద్ధం – మావోయిస్టులు…

వరంగల్ క్రైమ్ – ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ లేఖ ప్ర‌తులు వ‌రంగ‌ల్ జిల్లా మీడియా ప్ర‌తినిధుల‌కు అందాయి.. ఆ లేఖ‌లోఅయితే తాము విధించిన మూడు షరతులకు ఒప్పుకుంటే శాంతి చర్చలకు రావాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కోరారు.
మూడు డిమాండ్లు
దండకారణ్యంలో సాయిధ దళాలను తొలగించాలి.
మావోయిస్ట్ సంస్థలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి.
జైళ్లలో ఉన్న మావోయిస్ట్ నేతల్ని విడుదల చేయాలి అని లేఖలో పేర్కొన్నారు.
అందుకు సిద్ధమైతే తాము చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని మావోయిస్ట్ లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement