Wednesday, April 24, 2024

చాలా రాజ్యాలు చూశాం.. రాజన్నరాజ్యాలు అక్కర్లే: పువ్వాడ

షర్మిల పార్టీపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు అన్ని రాజ్యాలు చూశారని ..అన్ని రాజ్యాలు చూసాకే తెలంగాణ వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాజ్యాల్లో తెలంగాణ కు ఏమి లాభం చేకూరలేదని అన్నారు. తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలంగాణ వచ్చాక తెలిసిందన్నారు. ఆ రాజ్యాలు, రాజులు ఏమయ్యారో కూడా అందరికి తెలుసన్నారు. ఇక్కడి ప్రజలు ఆ ఉచ్చులో పడరని ఒకవేళ చిన్న స్థాయిలో ఎవరైనా వెళితే వెళ్లొచ్చు..వారి వల్ల మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఇక షర్మిల పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా తెలంగాణలో రాజకీయ దుమారం లేచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement