Monday, April 29, 2024

Breaking : పేద‌ల గుడిసెలు తొల‌గింపు.. ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డిన మ‌హిళ‌

ప్రభ న్యూస్ క్రైమ్ మహబూబాబాద్ – కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సిబ్బందిని గుడిసె వాసులు అడ్డుకున్నారు. పలువురు గుడిసె వాసులను పోలీసులు అదుపులో తీసుకోగా.. తోపులాటలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. గత నాలుగు వారాలుగా జిల్లా కేంద్రంలో దాదాపు వెయ్యి కుటుంబాలకు చెందిన పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు పోలీసులు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది జేసీబీ తీసుకుని రావడంతో గుడిసె వాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు గుడిసెవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సీపీఎం నాయకులు గుడిసె వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement