Friday, April 26, 2024

స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి ఏకో పార్కు వద్ద సోమవారం మాంటిసోరి పాఠశాలకు చెందిన బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల నుండి విద్యార్థులతో వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అనే 5వ తరగతి విద్యార్థికి గాయాలయ్యాయి. కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పెద్దగా విద్యార్థుల‌కు గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement