Thursday, April 25, 2024

తెలుగుదేశం ఇక జ‌నం బాట – రేపే పొలిట్ బ్యూరో స‌మావేశం..

అమరావతి,ఆంధ్రప్రభ: తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్‌ను నింపింది. పట్ట భద్రుల ఎన్నికల కు సంబంధించి మూడింటిని ఆ తరు వాత ఎమ్మెల్యే కోటాలో మరో స్థానాన్ని దక్కించుకున్న టీ-డీపీ అదే జోష్‌లో జనం బాట ప-్టట-ందుకు నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో ఇక పూర్తిగా జనం మధ్య నేతలు వుండేలా టీ-డీపీ అధినేత చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా రెండు రాష్ట్రాల నేతల సమావేశాలకు ప్లాన్‌ చేస్తున్నారు. పార్టీ పోలిట్‌ బ్యూరో సమావేశంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు అధి ష్టానం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు – సంస్థాగత కార్యక్రమాల మిళితంగా కార్యాచరణను రూపొందించారు. ఈనెల 28న హైదరాబాద్‌లో పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. సుదీర్ఘ కాలం తరువాత హైదరాబాద్‌లో ఈ పొలిట్‌ బ్యూరో మీటింగ్‌ జరగనుంది.ఈ సమావేశంలో మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీ య పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ, తీర్మానాలు రూపొందించనున్నారు.

అలాగే టీ-డీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాద్‌లో పార్టీ ప్రతి నిధుల సభను కూడా నిర్వహిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభకు హాజరుకానున్న రెండు రాష్ట్రాల టీ-డీపీ నేతలు హాజరుకానున్నారు. ఏపీ నుంచి ఈ సభకు పొలిట్‌ బ్యూరో సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జ్‌లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుహాజరు కానున్నారు. అలాగే ఆవిర్భావ సభకు క్లస్టర్‌ ఇంచార్జ్‌ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ- నాయకులకు ఆహ్వానం పంపారు. ఏప్రిల్‌ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాలలో పార్టీ జోన్‌-1, జోన్‌ -4, జోన్‌ -5 సమా వేశాలను టీ-డీపీ నిర్వహించనుంది. ఈసమావేశాలకు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై నేత లకు భవిష్యత్‌ కార్యాచరణపై మార్గదర్శనం చేయను న్నారు. ఈజోన్‌ సమావేశాల అనంతరం టీ-డీపీ అధి నేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు తయారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రజలతో పంచుకోవ డంతో పాటు-… ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటా లకు కసరత్తు చేస్తున్నారు అధినేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు అంతా క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యక్రమా ల రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే టీ-డీపీ అన్‌స్టాప బుల్‌గా పేర్కొన్న చంద్రబాబు, ఆదిశగా వ్యూహాలు రచిస్తున్నారు. కేడర్‌లో ఎన్నికల ఊపు తీసుకువచ్చే దిశ గా ప్రణాళికలు తయారు చేశారు. దీనిలో భాగంగానే పార్టీ కార్యక్రమాల నిర్వహణ రోడ్‌ మ్యాప్‌ను రెడీ చేశారు. ఒకవైపు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలను పార్టీకి చేరువ చేసేందుకు శ్రమిసు ్తన్నారు.నిత్యం వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement