Thursday, May 16, 2024

సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

బచ్చన్నపేట తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జిల్లా మండల పరిషత్ లకు 500 కోట్లు రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసన సభలో ప్రకటించడం పై జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య మండల పరిషత్ అధ్యక్షులు భావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు లు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మండల ప్రజా పరిషత్ సభ్యులచే జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి ల చిత్రపటానికి క్షిరాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కర్నాల వేణుగోపాల్ మామిడి అరుణ ఐలయ్య ఎండి షబ్బీర్ అహ్మద్ గూడెపు తిరుపతి హరి ప్రసాద్ సిద్దులు బాలరాజు ముసిని బాబు తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement