Tuesday, July 23, 2024

Tamil Nadu: రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకంలో బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు.

- Advertisement -

క్షతగాత్రులను చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై పడాలం పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement