Wednesday, May 22, 2024

యూ నూతన సైన్స్ డీన్ గా ఆచార్య డేవిడ్

కేయూ క్యాంపస్, : కాకతీయ విశ్వవిద్యాలయం నూతన ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ గా విశ్వవిద్యాలయ జియాలజీ విభాగానికి చెందిన ఆచార్య కె.డేవిడ్ ను నియమిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె పురుషోత్తం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాల కాలంపాటు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ గ కొనసాగనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం డేవిడ్ కాకతీయ విశ్వవిద్యాలయ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా కొనసాగుతున్నారు. గతంలో జియాలజీ విభాగానికి శాఖాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా, పరీక్షల నియంత్రణాధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం కళాశాల సిబ్బంది,అధ్యాపకులు,ఉద్యోగులు,పరిశోధకులు, విద్యార్థులు డేవిడ్ ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement