Sunday, May 5, 2024

Voted Hyderabad – ఓటు హక్కును వినియోగించుకున్న బిఆర్ఎస్ అభ్యర్ధులు కేపీ.వివేకానంద ., సామ సుందర్ రెడ్డి

కుత్బుల్లాపూర్ గ్రామం లోని సత్ జ్ఞాన్ హై స్కూల్ పోలింగ్ సెంటర్ నందు బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటులో కుల, మత, వర్గాల కతీతంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోకించుకోవాలని కోరారు.

ఓటు వేసిన బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి

యాకత్పురా నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి ఐ ఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వప్న సుందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లిటిల్ రోజెస్ స్కూల్లో ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ చంపపేట్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు

- Advertisement -

కుత్బుల్లాపూర్ గాజులరామారం తత్వ గ్లోబల్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హనుమంత్ రెడ్డి ..

మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్న కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు.

కూకట్‌పల్లి నియోజకవర్గం KPHB డివిజన్ లో గీతాంజలి మోడల్ స్కూల్ బూత్ నం 340 లో ఓటు హక్కు వినియోగించుకున్న కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం కుటుంబ సభ్యులు.

కెపిహెచ్బి డివిజన్ 9వ ఫేస్ మహిళా మండలి బిల్డింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

కూకట్ పల్లి నియోజకవర్గం కె.పి.హెచ్.బి సరోజినీ దేవి మహిళామండలి పోలింగ్ బూత్ 312 లో ఓటు హక్కు వినియోగంచుకున్న బి.అర్.యస్ పార్టీ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా..

ఓటు హక్కు వినియోగించుకున్న 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement