Saturday, May 18, 2024

MBNR : కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి…మన్నె గీతారెడ్డి

మక్తల్, మే 5(ప్రభన్యూస్‌): బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని దీంతో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని ఎంపి అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సతీమణి మన్నె గీతారెడ్డి పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మక్తల్ మండలంలోని గుడిగండ్ల ,జక్లేర్ గ్రామాల లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారరాన్ని చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6గ్యారెంటీల విస్మరించిందని ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారం లో భాగంగా కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు .అదేవిధంగా టీ పాయింట్ దగ్గర పలువురు కార్యకర్తలకు టీ అందరికీ పోస్తూ ఓటర్లను ఆకర్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement