Sunday, April 28, 2024

వాలీబాల్ చాంపియన్ ధర్మారం.. రెండో స్థానంలో జూలపల్లి..

వాలీబాల్ పోటీల్లో విజేతగా ధర్మారం జట్టు నిలిచింది. ఆదివారం పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో ఈ పోటీలు జ‌రిగాయి. పెద్దపల్లి సబ్ డివిజన్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ లో జూలపల్లి జట్టుపై గెలిచి ధర్మారం ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలవగా.. జూలపల్లి సెకండ్ ప్లేస్ కైవ‌సం చేసుకుంది. విజేతలకు పెద్దపల్లి అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడం తోపాటు మానసికోల్లాసాన్ని కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసీపీ సారంగపాణి,సిఐ లు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐ లు రాజేష్, ఉపేందర్, మహేందర్, లక్ష్మణ్, శ్రీనివాస్, జానీ పాషా, వెంకటేష్, రాజ వర్ధన్, వంశీ, రిటైర్డ్ పిఈటీ శంకరయ్య తో పాటు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement