Monday, May 6, 2024

దళిత జాతి ఆణిముత్యం ధర్మరాపు స్పందన ..

తొర్రురు ప్రభాన్యూస్ : ఇటీవల విడుదలైన అల్ ఇండియా నీట్ ఫలితాలలో సత్తాచాటి మెడిసిన్ సీటు సాధించిన చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మరాపు స్పందనను అభినందించారు ప్రొఫెసర్ ఖాసీం, ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్, కేవిపీస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందన దళిత జాతి ఆణిముత్యం అని,చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు స్పందనను, వారి తల్లిదండ్రులను అభినందించారు. స్పందనను స్ఫూర్తిగా తీసుకొని పేద విద్యార్థులు బాగా చదువుకొని పూలే, అంబేద్క‌ర్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ జే ఏ సి కార్యదర్శి రాయిశెట్టి ఉపేందర్, కేవిపీస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్, పట్టణ అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మంగళపల్లి నాగరాజు,రిటైర్డ్ టీచర్ ధర్మరాపు మల్లయ్య, ప్రభుత్వ టీచర్లు ధర్మరాపు రమేష్, యాకూబ్, మాదిగ జెఎసి జిల్లా నాయకులు మహంకాళి కార్తిక్,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement