Wednesday, May 8, 2024

Vikarabad : ఘాట్ రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. తప్పిన ప్రమాదం

వికారాబాద్ (ప్రభ న్యూస్) : కేరెల్లీ ఘాట్ రోడ్డులో నిలిచిపోయింది ఆర్టీసీ బస్సు.. వికారాబాద్ డిపో బస్సు రొంపల్లి ,బంటారం పెళ్లి తిరిగి వికారాబాద్ వస్తుండగా కిరెల్లి మెయిన్ ఘాట్ వద్ద రోడ్ల బస్సు నిలిచిపోయింది. బస్సు వెనకాలకి మెల్ల మెల్లగా జరగడంతో ఒకసారి బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన డ్రైవర్ కండక్టర్ వెంటనే బస్సు చక్రాల వెనకాల రాళ్లు పెట్టారు. బస్సు ఆగిన అనంతరం ప్రయాణికులను దింపేశారు. బస్సులో నుండి దిగిన ప్రయాణికులు ఆర్టీసీ పై మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement