Wednesday, May 8, 2024

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

లోకేశ్వరం, జూన్ 8 (ప్రభ న్యూస్) : లోకేశ్వరం మండలంలోని పూసుపూర్ గ్రామంలోని శ్రీ భీమన్న దేవుని ఆలయానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయ‌ని, తెలంగాణ వచ్చిన తరువాత దేవాలయాల అభివృద్ధి చాలా జరిగింది నిర్మల్ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి అన్నారు. భీమన్న దేవుని ఆలయం యొక్క ప్రొసీడింగ్ కాపీని గ్రామస్థులకు అందచేసిన‌ట్లు ఆయ‌న వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి న్యాకపాడుకుల సంఘం సోదరులు, గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామం సర్పంచ్ సంగేమ్ నర్సన్న, ఎంపీటీసీ మక్కాజి నర్సవ్వ, ఆలయ అధ్యక్షులు సుంకరి లక్ష్మణ్, నిమ్మ శివన్న, వీరేష్, రాజన్న, నర్సయ్య, రమేష్, సాయి, మలవాజీ, విఠల్, ముత్తన్న సంగేమ్ రాజు పోతన్న, సాయన్న, భీమేష్, న్యాకపాడ్ కుల సంఘ సోదరులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement