Thursday, May 16, 2024

TS: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి

ప్రముఖ సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి థాక్రే సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలనే కాంగ్రెస్ లో చేరానని విజయశాంతి అన్నారు.

గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. బుధవారం ఈమె బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement