Friday, April 26, 2024

టీటీఏటీ క్రిక్ ఫెస్ట్ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేసిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

టీటీఏటీ – టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లబ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌కి టీటీఏటీ క్రిక్ ఫెస్ట్ -2021 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌ర‌య్యారు. ఈరోజు ఉదయం నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా విచ్చేసి ట్రావెల్ ట్రేడ్ టీటీఏటీ అండ్ ఎయిర్‌లైన్స్ క్రిక్ ఫ్రెండ్లీ ఫెస్ట్‌లో పాల్గొని విజేతలకు కప్స్ అందించారు. ఈసంద‌ర్భంగా వారు ఉప్ప‌ల శ్రీనివాస గుప్తాను స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో.. టీటీఏటీ ఫౌండర్, ప్రెసిడెంట్ ఆర్ వి. రమణ కుమార్, ఫౌండర్, సెక్రటరీ టీటీఏటీ కె శ్రీనివాస్ రావు, ఫౌండర్, ప్రెసిడెంట్ కె. దేవేందర్, ఫౌండర్ బి.సాయి బాబు, జనరల్ సెక్రటరీ ఫౌండర్ రమణ కుమార్, అండ్ ఏపీక్స్ కమిటీ మెంబెర్స్ బృందం, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement