Thursday, April 25, 2024

Accident – బైక్ – కారు ఢీ … ఇద్ద‌రు మృతి..

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి (ప్రభ న్యూస్) శంకరపల్లి మండలం జన్వాడ దగ్గర మోటర్ సైకిల్ ని కారు ఢీ కొన్న ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. ముందుగా ఈ సంఘటన స్థలంలోనే బైక్ పై ఉన్న జన్వాడ గ్రామానికి చెందిన బెగరి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.. మోతుకుపల్లి శ్రీశేలంకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మెరుగైన చికిత్స కొరకు ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. సంవత్సరం క్రితం వివాహం జరిగింది. ఈ ప్రమాదానికి కారు అతివేగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement