Sunday, April 28, 2024

WGL: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

మల్హర్, అక్టోబర్ 18 (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సమీపాన పొలాల వద్ద అనుమానాస్పద స్థితిలో పిట్టల రాహుల్ (22) యువకుడు మృతిచెందాడు. బుధవారం ఉదయం వరిపొలాల వద్దకు వెళ్ళిన రైతులు గమనించి రాహుల్ మృతిచెందిన విషయాన్ని మృతుని కుటుంబీకులకు తెలిపారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి చేరుకుని రాహుల్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement