Sunday, May 19, 2024

ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను త‌గ్గించిన టిఎస్ఆర్టీసీ..

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు తెలిపారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement