Monday, May 6, 2024

హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్ట్ లో.. మ‌హేశ్ బాబు

హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్ట్ లో మెరిశారు స్టార్ హీరో మ‌హేశ్ బాబు .. ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ మూవీ షూట్ గ్యాప్ లో స్పెయిన్ కి వెళ్లారు స్టార్ హీరో మ‌హేశ్ బాబు. ఈ ట్రిప్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమైన మహేష్ ని మీడియా కెమెరాల్లో బంధించారు. గడ్డం పెంచిన మహేష్ మాస్ లుక్ కేక పుట్టిస్తుంది. జూన్ మొదటి వారం నుండి ఎస్ఎస్ఎమ్బి 28 చిత్ర షూటింగ్ మొదలుకానుంది. మూడు నెలలు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. దీంతో మహేష్ బాబు సన్నద్ధం అవుతున్నారు.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మహేష్ పాత్ర పై కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. ఇక టైటిల్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు వంటి టైటిల్ పరిగణలో ఉన్నాయట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement