హెదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ చేరికల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని టీఆర్ఎస్ కార్పోరేట్ పి. విజయారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు రోజుల క్రితం టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో విజయారెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లిd నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగుతున్నది. మాజీ మంత్రి పి. జనార్దన్రెడ్డి ఖైరాత్బాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన కూతురు తిరిగి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.