Wednesday, May 15, 2024

సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్‌ సైనీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భూ పరిపాలనా శాఖ ప్రధాన కార్యాలయం డైరెక్టర్‌గా నజత్‌కుమార్‌ సైనీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లుగా సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. కాగా గడచిన రెండేళ్ల కిత్రం రజత్‌కుమార్‌ షైనీ ఇదే పోస్టులో కొనసాగారు.

అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన విద్యాభ్యాసం పూర్తి కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. తాజాగా పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న నేపథ్యంలో 2007 బ్యాచ్‌కు చెందిన ఆయనను తిరిగి అదే పోస్టులో నియమిస్తూ బుధవారం సీఎస్‌ సోమేష్‌కుమార్‌ జీవో 1288రి జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement