Wednesday, May 8, 2024

18న మేడారం జాత‌ర‌కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ నెల 18, 20, 21, 23వ తేదీల్లో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 18వ‌తేదీన‌ మేడారం జాత‌ర‌కు వెళ్ల‌నున్నారు. వ‌న దేవ‌త‌లైన‌ స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మకు కేసీఆర్ బంగారం స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. అలాగే ఈనెల 20వ‌ తేదీన.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. 21వ తేదీన‌.. నారాయణ ఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 23వ‌ తేదీన.. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement