Thursday, May 9, 2024

నిజామాబాద్ లో రౌడీ మూకల వీరంగం.. రౌడీషీటర్లు కొట్లాట

నిజామాబాద్‌ లో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్‌లోని రజాక్‌ టీ స్టాల్‌పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్‌, అనుచరులు దాడులకు తెగబడ్డారు. హోటల్‌లో టీ తాగుతుండగా వివాదం తలెత్తడంతో రౌడీషీటర్ల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ హిబ్బుతో పాటు అతని అనుచరులు దాడి చేశారు. ఒక్కసారిగా అయిదుగురు రౌడీలు రజాక్ హోటల్‌పై ఇనుప రాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్‌లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.  ఈ ఘటనలో రౌడీ షీటర్ జంగిల్ హిబ్బు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్ల దాడిలో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement