Sunday, April 28, 2024

Hyderabad: బైకుని ఢీకొట్టిన వాట‌ర్ ట్యాంక‌ర్‌.. ఎస్సై రాత ప‌రీక్ష‌ల‌కు వ‌చ్చి మృత్యు ఒడికి

కుత్బుల్లాపూర్ (క్రైమ్) (ప్రభ న్యూస్) : హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం నెల‌కొంది. ఒక వ్య‌క్తి ఎస్ రాత ప‌రీక్ష‌లు ముగించుకుని ఇంటికి వెళ్తుండ‌గా జ‌రిగిన యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న దుండిగ‌ల్ స‌మీపంలో ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. అయితే.. ఎస్సై కావాల‌న్న త‌న చిర‌కాల వాంఛ‌.. అదే విధంగా త‌న సోద‌రి వివాహానికి హాజ‌రుకావాల‌న్న త‌ప‌న నెర‌వేర‌లేదు. సోద‌రి పెళ్లికి వెళ్లాల్సిన వ్య‌క్తిని మృత్యురూపంలో వ‌చ్చిన లారీ ప్రాణాలు తీసింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నల్లకుంటకు చెందిన మర అంజయ్య (32) ఎస్సై పరీక్షలు రాసేందుకు దుండిగల్ లోని ఎంఎల్ ఆర్ ఐటీ కాలేజీకి వచ్చాడు. పరీక్షలు ముగించుకొని తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో టీఎస్ ఐఐసీ కాలనీ దగ్గరకు రాగానే వెనుకనుంచి వ‌చ్చిన వాటర్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో అదే వేహిక‌ల్ కింద‌ప‌డి అక్కడిక‌క్క‌డే చ‌నిపోయాడు. వాట‌ర్ ట్యాంక‌ర్‌ డ్రైవర్ అతివేగం, నిర్లక్షంగా వాహనాన్ని నడపడంతోనే అంజ‌య్య చ‌నిపోయిన‌ట్టు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తెలిసింది. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న‌ట్టు జీడిమెట్ల ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement