Tuesday, April 16, 2024

‘పోకిరి’కి త‌గ్గ‌ని ఫ్యాన్ బేస్.. ఇంత‌కింత‌కీ పెరుగుతున్న అడ్వాస్డ్ బుకింగ్స్..

మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న పోకిరి సినిమా 4 కే వెర్ష‌న్‌లో రీ రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. తొలుత కొన్ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అభిమానుల రెస్పాన్స్ అంత‌కంత‌కు పెర‌గ‌డంతో స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వ‌చ్చారు. ఈ సినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు పూర్త‌య్యాయి, అయినా ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న‌ క్రేజ్ ఇంత కూడా త‌గ్గ‌లేదు.. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంట‌ల్లోనే అన్ని షోస్ హౌస్ ఫుల్ అయి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన వ‌సూళ్ల‌ను మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌బోతున్నారు.

ఇండియాతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో క‌లిసి 135 స్క్రీన్స్‌లో పోకిరిని 4 కే వెర్ష‌న్‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. అత్య‌ధిక సెంట‌ర్స్ లో రెండోసారి రిలీజ్ అవుతున్న సినిమాగా పోకిరి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ రీ రిలీజ్‌కు మూడు రోజుల ముందే అన్ని షోల టికెట్స్ అమ్ముడుపోయాయి. హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన థియేట‌ర్స్ అన్నింటిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలో ప‌లు న‌గ‌రాల్లో అడ్వాన్ప్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ద గంట‌ల్లోనే థియేట‌ర్స్ హౌజ్‌పుల్ అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement