Wednesday, May 8, 2024

రాజకీయ కుట్రతోనే నాపై కేసు.. బండి సంజయ్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పదవ తరగతి పేపర్ లీక్ ఘటనలో 14 రోజుల రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తాజాగా బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు లేఖ రాశారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని తెలిపారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారన్నారు. పదవ తరగతి పేపర్ లీకేజీ విషయంలో కేటీఆర్ ను ప్రశ్నించినందుకే తనపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మజ్లీస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులతో దోస్తీ చేస్తున్నారని రాసుకొచ్చారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement