Monday, April 29, 2024

రూ. 719 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ కు కొత్త రూపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. అత్యాధునిక హంగులతో అభి వృద్ధి చేయనున్న ఈ స్టేషన్‌ విమానాశ్రయాన్ని తలపించ నుం ది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ప్రయాణికులకు అందు బాటులోకి రానున్నాయి. ఈనెల 8న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆవరణలో పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా, మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేష న్లలో రాబోయే 50 ఏళ్లకు సరిపోయేలా సకల సౌకర్యాలు ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో సికిం ద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఒకటి. రూ.719 కోట్ల అంచనా వ్య యంగా నిర్ణయించారు. ఈ రైల్వే స్టేషన్‌ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపు దిద్దుకో నుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కే తలమానికంగా నిలవనున్న ఈ రైల్వే స్టేషన్‌లో ప్రయా ణికుల విశ్రాంతి కోసం అత్యంత విలాసవంతమైన లాంజ్‌లు, రైళ్ల రాక పోకలను కచ్చితంగా తెలిపే సమాచార వ్యవస్థను ఏర్పా టు చేయనున్నారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ గతంలోనే రావాల్సి ఉం డగా పలు కారణాల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. దీంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రధాని మోడీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కాగా, తన పర్యటన సంద ర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభిం చను న్నారు.

సికింద్రా బాద్‌- తిరు పతి మధ్య రాకపోకలు సాగించే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ మా ర్గం లో ప్రయాణించే మిగతా రైళ్ల కన్నా దాదాపు 8 గంటలలోపే గమ్యస్థానానికి ప్రయాణికులను చేర వేయనుంది. తాజాగా ఈ రైలుకు రైల్వే శాఖ నంబర్లను కూడా కేటాయించింది. సికింద్రా బాద్‌ నుంచి బయలుదేరే సర్వీసుకు 20701, తిరిగి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరే సర్వీసుకు 20702 నంబ ర్లను రైల్వే శాఖ ఖరారు చేసింది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రా రంభయ్యే రోజున ఉదయం 11-30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరుపతికి చేరుకుం టు ంది. మిగతా అన్ని రోజుల్లో తెల్లవారు జా మున 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి మధ్యాహ్నం 2-30 గంటలకు చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement