రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కలిశారు. ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈమేరకు టీజీవో రాష్ట్ర ప్రెసిడెంట్ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో పలువురు అసోసియేషన్ నాయకులు మంత్రి హత్యకు కుట్ర జరగడాన్ని ఖండించారు. దేవుని దయంతో కుట్ర ముందే బయటపడడం మంచి జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని తాము కోరుతున్నట్టు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital