Sunday, May 5, 2024

ముత్యంపేటలో ఉద్రిక్తత-పోలీసుల లాఠీ ఛార్జ్

దోమకొండ, ప్రభన్యూస్ : ముత్యంపేట గ్రామంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రెండు రోజుల క్రితం గ్రామంలో యువతి మేఘమాల గ్రామ శివారులోని కుంటలో చనిపోయిన విషయంలో గ్రామంలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. యువతి మృతికి ఒక యువకుడు కారణమని, యువతి కాల్ డేటాలో ఆ యువ‌కుని ఫోన్ కాల్స్ ఉండడం, ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తును కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. అ యువకున్ని పోలీసులు అదుపులోనికి తీసుకునే ప్రయత్నంలో గ్రామంలో గొడవలు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులతో పాటు దోమకొండ ఎస్సై సుధాకర్ పీకేటింగ్ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement