Saturday, April 27, 2024

వీధి వ్యాపారుల‌కు తెలంగాణ సర్కార్ అండ‌దండ‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పట్టణ పేద లు.. వీధి వ్యాపారులకు రుణాల మంజూ రులో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ముందు వరుస లో నిలుస్తోంది. ఇప్పటి వరకు మూ డు విడతల రుణాలను వీధి వ్యాపారులకు అందజేయగా… అందులో 1, 2 విడత ల్లో 100శాతం రుణాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేసిన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ మొద టి స్థానం లో నిలిచింది. ఒకటవ విడత రుణాలు (వీధి వ్యాపారి కి రూ.10వేలు రుణ పంపిణీ చొప్పున 3, 40, 000 వీధి వ్యాపారులకు ఇవ్వాలని నిర్ణయించి 3, 51, 467 మందికి రూ.351.46కోట్ల మేర రుణాలను పంపిణీ చేసింది. మొదటి విడతలో 100శాతం రుణాలను కల్పించిన తెలంగాణ రాష్ట్రంలో 1లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో దేశంలో మొదటి 10 స్థానాల్లో తెలంగాణకు చెందిన సిరిసిల్ల మొదటి స్థానంలో, సిద్ధిపేట ద్వితీయ, నిర్మల్‌ తృతియ, కామారెడ్డి, బోధన్‌, జహీరాబాద్‌, మంచి ర్యాల, పాల్వంచ, సంగారెడ్డి 10స్థానంలో ఆర్మూరు పట్టణాలు నిలిచాయి. ప్రధాన పట్టణాలు, నగరాల విభాగంలో 1 నుండి 10లక్షల మధ్య జనాభా కేటగిరి లో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ దేశం లోనే మొదటిస్థానంలో నిలిచింది.

తర్వాత నిజామా బాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 9వ స్తానంలో నిలిచిం ది. మెగా సిటీల (40లక్షల జనాభా కంటే ఎక్కువ) జీహెచ్‌ఎంసీ దేశంలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో విడత రుణాల (వీధి వ్యాపారికి రూ.20వేల చొప్పున) 1, 21, 672 వీధి వ్యాపారులకు రూ.242. 62కోట్ల రుణాలు మంజూరయ్యాయి. రెండో విడత రుణాల పంపిణీలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిస్థానంలో నిలిచింది. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో దేశంలోని మొదటి 10 స్థానాల్లో 09 నగరాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే. మొదటి స్థానంలో కామారెడ్డి, ద్వితీయ స్థానంలో సిరిసిల్ల, నిర్మల్‌, సిద్ధిపేట, మంచిర్యాల, కోరుట్ల, సంగారెడ్డి, ఆర్మూరు తదుపరి స్థానాల్లో నిలిచాయి. ప్రధాన నగరాల విభాగంలో (1 నుండి 10లక్షల మధ్య జనాభా) కలిగిన నగరాల్లో జీహెచ్‌ఎంసీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కరీంనగర్‌ ద్వితీయ, నిజామాబాద్‌ మూడో స్థానంలో రామగుండం 5వస్థానం, ఖమ్మం 6వ స్తానంలో ఉన్నాయి. మెగా సిటీల విభాగంలో జీహెచ్‌ఎంసీ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మూడో విడత రుణాల పంపిణీలో (ఒక్కో వీది వ్యాపారికి రూ.50వేల రుణం) చొప్పు 2214 మందికి రుణాలు ఇచ్చారు. రుణాలు రికవరి, డిజిటల్‌ చెల్లింపుల్లోనూ వీధి వ్యాపారులు ముందున్నారు. డిజిటల్‌ లావాదేవీలు జరిపినందుకు దేశ వ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులకు లభించిన రూ.23కోట్ల నగదు ప్రోత్సాహకాల్లో తెలంగాణలోని వీధి వ్యాపారులు రూ.4కోట్ల 50లక్షలు పొందారు. దేశ వ్యాప్తంగా లభించిన మొత్తం వడ్డీ రాయితీ రూ.66కోట్ల 56లక్షల్లో తెలంగాణ రాష్ట్రంలోని వీధి వ్యాపారులు రూ.9కోట్ల 26లక్షలు పొందారు. స్థానిక వినియోగదారులకు, వీధి వ్యాపారులకు, వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తం గా పట్టణ ప్రగతి కింద మౌళిక సదుపాయాలతో 618 స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

వైవిధ్యమైన, సమ్మిళిత జీవన శైలి కలిగిన పట్టణాల్లో జీవిస్తున్న పేద కుటుంబాలు, వీధి వ్యాపా రుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో పట్టణ జనాభాలో 4.24శాతం అంటే 6, 22, 476 మం ది వీధి వ్యాపారులు ఉన్నట్లు తేలింది. పట్టణ పేదలు, వీధి వ్యాపారులను సంఘటితం చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఇతోధికంగా చేయూతనందిస్తోంది. లక్ష్యానికి మించి బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తోంది. 2021, 22లో నిర్దేశించిన రూ.1507 కోట్ల బ్యాంకు లింకేజీకి మించి 33, 324 సంఘాలకు రూ.2429 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు. 2022-23లో లక్షిత రూ.1745 కోట్లకు మించి మొత్తం 26, 016 పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.2083 కోట్ల బ్యాంకు రుణాలను అందించారు. అన్ని వర్గాలను అక్కునచేర్చుకునే నిలయాలుగా తెలంగాణ లోని పలు నగరాలు, మున్సిపల్‌ పట్టణాలు గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం కంటోన్మెంట్‌ ఏరియాతో కలిపి రాష్ట్రంలోని 143 పురపాలక సంస్థల్లో 1, 77, 503 స్వయం సహాయక సంఘాల్లో 18, 02, 284 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద వీధి వ్యాపారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోంది.

అన్ని పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ప్రాథమిక సౌకర్యాలను అందించడం ద్వారా వీధి విక్రయ మండలాల విభజన, మౌళిక సదుపాయాల అభివృద్ధి ఒక భాగం. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద 618 వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేయగా వీటిల్ల 2676 వ్యాపార షెడ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 1294 షెడ్‌ల నిర్మాణం పూర్తయింది. మరో 1382 షెడ్‌ల పనులు పురోగతిలో ఉన్నాయి. స్వయం ఉపాధి కార్యక్రమం కింద స్వయం సంఘాలతో పురపాలికల్లో రూ.140కోట్లతో 15,674 సూక్ష్మ పరిశ్రమ యూనిట్లను ఏర్పాటు చేశారు. 2022023లో రూ.16కోట్ల 20లక్షలతో 1584 యూనిట్లు నెలకొల్పారు. కొవిడ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ ద్వారా ఇప్పటి వరకు 37, 512 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 17 233 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement