Thursday, May 2, 2024

కాకతీయ కెనాల్ లో విద్యార్థి గల్లంతు

వరంగల్ క్రైమ్ ఆగస్టు 14 (ప్రభ న్యూస్) హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అదే ప్రాంతంలో నివాసం ఉండే ఇద్దరు విద్యార్థులు ఆడుకొంటు పొరబాటున కాలు జారి కాకతీయ కెనాల్ లో పడ్డారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుండి నీటిని విడుదల చేయడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాకతీయ కాలువలో పడి కొట్టుకుపోతున్న చిన్నారులను చూసిన ఓ చేపల వేటగాడు వల విసిరి 6వ,తరగతి చదివే ధరవాత్ చరణ్ ను కాపాడాడు

.కానీ మరో 6 వ,తరగతి చదివే దుర్గ కాలనీకి చెందిన విఘ్నేష్ గల్లంతయ్యాడు. గల్లంతు అయిన విగ్నేష్ కోసం గాలిస్తున్నారు.హన్మకొండ లోని సెయింట్ థామస్ స్కూల్ లో చదువుతున్నారు.హన్మకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement