Monday, April 29, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 18 గేట్ల ఎత్తివేత … లోత‌ట్టు ప్రాంతాల‌కు హెచ్చ‌రిక

ఆర్మూర్: ప్రభ న్యూస్: జూలై 27, – శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరిహాక ప్రాంతాలలో అతి భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తింది. దీంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 18గేట్లు ఎత్తి 42000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దిగువన ఉన్న ప్రాంత ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రాజెక్ట్ ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి అన్నారు .

పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు, రైతులు నది వైపు వెళ్ళవద్దని హెచ్చరించారు. నదీ పరివాహ ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement