Wednesday, May 8, 2024

Breaking: తండ్రిని కొట్టి చంపిన కొడుకు.. భూ వివాద‌మే కార‌ణ‌మా?

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వ‌డ్డెరకాలనీకీ చెందిన శివరాత్రి రాములు (65) ను అతని కొడుకు శ్రీనివాస్ కర్రతో తలపై కొట్టి చంపేసిన‌ట్టు తెలుస్తోంది. రాములు ఇంట్లోని మంచంపై పడుకొని ఉండగా శ్రీనివాస్ ఫుల్‌గా తాగివచ్చి ఈ దురాఘాతానికి పాల్ప‌డ్డ‌ట్టు గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ సంఘటనా జరిగిన స్థలానికి చేరుకొని ప‌రిశీలించారు. నిందితుడు శ్రీ‌నివాస్‌ని అదుపులోకి తీసుక‌న్నారు.

కాగా, ఈ హ‌త్యను పథకం ప్రకారం చేశార‌ని, దీనికి ఎల్లారెడ్డిపేటకు చెందిన మరో ఇద్దరు సహ‌కరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ భూమి అమ్మనివ్వకుండ త‌న తండ్రి రాములు అడ్డుపడుతున్నాడని శ్రీనివాస్ కొట్టి చంపినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. రాములు మృతదేహాన్ని చూసి కూతురు, బంధుమిత్రులు బోరునవిలపించారు. దీంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement